SS: మడకశిర క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాన్య ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వీటి సత్వర పరిష్కారం కోసం తక్షణమే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.