ATP: యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాల ఏపీ పీజీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 1154 మంది పరీక్ష రాయగా 1040 మంది అర్హత సాధించారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో భార్గవి రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించారు. జనరల్ విభాగంలో వడ్డే అనిల్ కుమార్, సెరికల్చర్లో ఎస్. హర్షవర్దిని, టి. మదీనా తస్లీం రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకులు సాధించారు.