SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని నిర్మించిన నూతన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం ఈ కార్యక్రమానికి పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, నిత్యపూజల కోసం రూ. 2.లక్షల విరాళం అందజేశారు.