కోనసీమ: అమలాపురం పట్టణ మున్సిపాలిటీ మంచినీటి కుళాయి సమస్యపై మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్కి 19, 20 వార్డుల ప్రజలు బుధవారం వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం పట్టణంలో మంచినీటి సమస్య కొరత ఉన్నదని, ట్యాంకుల ద్వారా అన్ని వార్డులకు సప్లై చేయాలని, వేసవికాలం సందర్భంగా వార్డుల పరిధిలో మంచినీటి సమస్య లేకుండా తీర్చాలని వారు కోరారు.