MHBD: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎస్సై గిరిధర్ రెడ్డి సూచించారు. బుధవారం రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా గూడూరు మండలంలో వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు సరైన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్ ఉండాలని, హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.