KDP: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్లకు సీఐ రాజగోపాల్ సూచించారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కూడళ్ల వద్ద శనివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సరైన పత్రాలు లేని వాటిని గుర్తించి ఫైన్ వేశారు. ప్రమాదాలు జరగకుండా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని కోరారు.