ELR: టి.నరసాపురం మండలంలోని అల్లంచర్లరాజుపాలెంలో ఆదివారం నిర్వహించే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొంటారని మండల అభివృద్ధి అధికారిణి మంగాకుమారి తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.