నెల్లూరు: నాయుడుపేటలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకులానికి కిలోమీటర్ దూరంలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి తాగునీటి సరఫరాను శనివారం తిరిగి ప్రారంభించారు. ఆరేళ్ల కిందట మోటర్ కొట్టుకుపోయి పైప్ లైన్లు మరమ్మతులకు గురయ్యాయి. దాత సన్నారెడ్డి దయాకర్ రెడ్డి నదిలో కొత్తగా బోరు వేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.