సత్యసాయి: జగన్ మెహన్ రెడ్డి అవినీతికి అంతే లేకుండా పోతోందని, చివరికి హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూలో కూడా జంతువు కొవ్వు వాడాడని, ఆయనకు కఠిన శిక్ష పడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత డిమాండ్ చేశారు. సోమందేపల్లి మండలంలో మంత్రి మాట్లాడుతూ.. జగన్ రెడ్డి భూ కబ్జాలు, అక్రమ ఇసుక, మైనింగ్తో ఇష్టారాజ్యంగా దోచుకున్నాడని మండిపడ్డారు.