కృష్ణా: అనుమతులు లేకుండా ఎవరైనా దీపావళి మందుగుండు సామాగ్రి కలిగి ఉన్నా, తయారీ, రవాణా చేస్తుంటే నేరంగా పరిగణిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ తెలిపారు. లైసెన్సు లేకుండా ఎవరైనా క్రాకర్స్ విక్రయిస్తున్నా, రవాణా చేస్తున్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన ఈ మేరకు కృష్ణా జిల్లా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.