CTR: చిత్తూరు-తచ్చూరు నేషనల్ హైవే రైతుల నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొంటారని ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల కార్యదర్శులు నాగరాజన్, మురళీ తెలిపారు. నగరి సమీపంలోని ఐనంబాకం వద్ద ఉన్న పాదిరి గ్రామం వద్ద ఆదివారం ఉదయం 10 గంటల నుంచి వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.