NLR: సంగం ఇసుక డంపింగ్ యార్డు నుంచి శనివారం ఇసుక అమ్మకాలు ప్రారంభించారు. 15 రోజులుగా పెన్నా నది నుంచి నెల్లూరు-ముంబై హైవే సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక యార్డుకు ఇసుకను తరలించి నిల్వ చేసిన అధికారులు. నేటి నుంచి ఇసుక అమ్మకాలను ప్రారంభించగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టిక ప్రకారం ఇసుకను అందిస్తున్నామన్నారు.