SKLM: నందిగాం మండలంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్న నాయుడు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి 100 రోజుల్లో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.