E.G: రాజానగరం మండలంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ఆయన పలు సమస్యలపై చర్చించారు. మౌలిక వస్తువులకు సంబంధించిన పలు సమస్యలను స్థానిక ప్రజలు ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కృషి చేస్తానని తెలిపారు.