PLD: నరసరావుపేటలో కల్తీ ఆహారాలను అరికట్టాలని సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేటలో జంతువుల నుంచి వచ్చే కొవ్వు నూనెలు ఉపయోగించి అనేక బిర్యాని పాయింట్లలో ఆహారాలు తయారు చేస్తున్నారని, తద్వారా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. వెంటనే అధికారులు కల్తీ ఆహారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.