సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ పునర్విభజనపై వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందించారు. నియోజకవర్గం విడిపోతుందని కొందరు అనవసర ఆవేదన పొందుతున్నారన్నారు. అయితే ఎన్ని భాగాలుగా విడిపోయినా గెలుపును ప్రభావితం చేసే శక్తి కేతిరెడ్డికే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి కార్యకర్తలే అసలైన మూలస్తంభాలని స్పష్టం చేశారు.