KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ రూపొందించిన మాస్టర్ ప్లాన్ మ్యాప్ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గురువారం టీటీడీ అతిధి గృహంలో ఒంటిమిట్ట ఆలయం అభివృద్ధిపై అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ను జిల్లా కలెక్టర్ శ్రీధర్, టీటీడీ JEO వీరబ్రహ్మం సీఎంకు వివరించారు.