AP: రేపటి నుంచి మూడు రోజులపాటు లెజిస్లేచర్ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడాకారులకు (శాసనసభ్యులు, మండలి సభ్యులు, సిబ్బందికి) ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యం.