PPM: నీతి ఆయోగ్ భారత్ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన సిటీ రీజియన్స్ గ్రోత్ హబ్ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లాను అభివృద్ధిలో నడిపించేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధమైందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అందులో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్స్ కింద జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కమిటీకి జేసీ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు.