హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తపై జరిగిన దాడి ఘటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సోమవారం సీపీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, పీడీ యాక్ట్ నమోదు చేసి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.