CTR: తవణంపల్లిలోని జొన్నగురకలలో కాలనీవాసులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో సరైన నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ రామరాజు ఆధ్వర్యంలో కాలనీవాసులు డిప్యూటీ ఎంపీడీవో రాజశేఖర్కు వినతి పత్రం అందించారు. వెంటనే తాగునీటి సరఫరా మెరుగుపరచాలని ఎంపీడీవో సంబంధిత అధికారులను ఆదేశించారు.