NTR: తిరువూరు మండలంలోని చౌక ధరల దుకాణాలను ఆర్డీవో కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, అన్ని రేషన్ కార్డు దారులకు తాగునీరు తప్పనిసరిగా అందించాలని, 50 నుండి 65 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, షాప్ టైమింగ్ను ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు కాకుండా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాలని తెలియజేశారు.