విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో క్యాంపస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు.
ప్రస్తుతం తిరుపతి అయోధ్యను తలపిస్తోంది. అడుగడుగునా ప్రభాస్ ఆదిపురుష్ కటౌట్సే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ పేరే జపిస్తోంది. తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేయని సాహసం చేశారు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా చేస్తున్న ఆది పురుష్.
అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. వచ్చిన ఛాన్స్కు కూడా వదులుకుంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వద్దని చెప్పడంతో.. నెటిజన్స్ కాస్త షాక్ అవుతున్నారు. ఇంతకీ రకుల్ ప్రీత్.. పవన్ కళ్యాణ్కు నిజంగానే హ్యాండ్ ఇచ్చిందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందట. అందుకోసి కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
ఈరోజుల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడి ఇబ్బంిది పడుతున్నారు. క్యాన్సర్ చివరి స్టేజ్ లోకి వచ్చేవరకు చాలా మందికి తమకు క్యాన్సర్ సోకిన విషయం తెలియడం లేదు. దీని వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు ఉన్నారు. అయితే, తాజాగా నిపుణులు దీనికి ఓ పరిష్కారం తీసుకువచ్చారు. కేవలం ఒక్క బ్లడ్ టెస్టుతో 50 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చని వారు చెబుతున్నారు.
జూన్ 14వ తేది నుంచి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఉండనున్నారు. ఈ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాతే మళ్లీ షూటింగ్(Shooting) స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పవన్ చేసే సినిమాల షూటింగులన్నీ ఇప్పుడు ఆగిపోనున్నాయి.
ఈతకు వెళ్లిన నలుగురు మృతిచెందడంతో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఘటనా స్థలి వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడుగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్.. జూన్ 16న గ్రాండ్గా థియేటర్లోకి రాబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. కృతి సనన్ సీతగా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. దీనికి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రానున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర విషాదం జరిగి రెండు రోజులైంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి ట్రాక్ల పునరుద్ధరణ కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో కేవలం 51 గంటల్లోనే పూర్తి పనులను కంప్లీట్ చేయించి తిరిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇది తెలిసిన సిబ్బందితోపాటు పలువురు మంత్రి చొరవను అభినందిస్తున్నారు.
కొండచరియలు విరిగి పడటంతో 19 మంది మృతిచెందిన ఘటన చైనాలో ఆదివారం చోటుచేసుకుంది. విరిగిపడ్డ కొండ చరియల ప్రాంతంలో 40 వేల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒడిశాలో రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident) సిగ్నలింగ్ లోపం వల్లే జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. గూడ్స్ ట్రైన్లో ఇనుము ముడి పదార్థాలు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైందని, అందుకే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
పట్టుదల, కృషితో ముందుకుపోయి దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, అగ్ర వర్ణాల్లో ఉన్న నిరుపేదలను కూడా సమాన స్థాయికి తీసుకుపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. తాగు, కరెంట్, సాగునీటి సమస్యలను 9 ఏళ్లలో అధికమించామన్నారు. పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలని, ఈ సీజన్ నుంచే రైతుబంధు అందించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు.
వేసవిలో చిన్నపిల్లలే టార్గెట్గా కుక్కల దాడులు జరుగుతున్నాయి. తాజాగా వీధి కుక్క ఓ బాలుడిపై దాడి(Dog Attack) చేసింది. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స జరుగుతోంది.