సికింద్రాబాద్ కంటోన్మెంట్ (contonment) బీఆర్ఎస్ (brs) ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొంత కాలంగా గుండె, కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన యశోద హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఆయన నాలుగు సార్లు కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు తెలుగు దేశం పార్టీ నుండి గెలిచిన ఆయన 2014 తర్వాత బి అర్ ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి అదే పార్టీ నుండి విజయం సాధించారు.
పరామర్శ సమయంలో చంద్రబాబు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా మాట్లాడుకోవడం ఆసక్తికరం. ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తారకరత్నకు అందించిన వైద్యం, అంత్యక్రియలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది. విజయసాయిరెడ్డి తారకరత్న బంధువు. అందుకే దగ్గరుండి తారకరత్న కార్యక్రమాలు చూసుకుంటున్నారు.
తారకరత్నకు కుటుంబసభ్యులు, ప్రముఖులతో పాటు అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని మోకిలలో ఉన్న తారకరత్న నివాసాలను ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తారకరత్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు.
వైఎస్ఆర్టీపీ(YSRTP) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ షర్మిల(YS Sharmila) చేపడుతున్న పాదయాత్రను రద్దు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కుటుంబంలోని ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) దుర్మరణం పాలవగా.. అనారోగ్యంతో ఇద్దరు ఆకస్మిక మృతి చెందారు. ఇక మరికొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ కుటుంబాన్ని యముడు వెంటపడుతున్నట్లు పరిస్థితి ఉంది. తాజాగా నందమూరి తారకరత్న మృతితో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగింది.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హీరో నందమూరి తారకరత్న(Taraka Ratna) కన్నుముశారు. ఈ క్రమంలో బెంగళూరు(bangalore) నుంచి హైదరాబాద్(hyderabad)కు తీసుకొచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు(family members) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ శివుడికే శఠగోపం పెట్టిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్న లక్షల మంది భక్తలకు కనీస సౌకర్యాలు లేవని నిలదీశారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మాణం క్లిష్టమైన సమస్యగా మారిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు. మెట్రోలైన్ నిర్మించే రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు చేపట్టనున్న ఇంజినీరింగ్ వర్క్ ఇబ్బందిగా మారుతుందన్నారు. సుమారు 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం కష్టతరమని అంటున్నారు. ఆ క్రమంలో ఫ్లై ఓవర్, అండర్ పాస్, మధ్యలో రోటరీ వంటివి అడ్డుగా ఉన్నాయని వెల్లడించారు.
errabelli dayakar rao:తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలు ఆయనను టార్గెట్ చేశాయి. తాను ఒక్క ఎకరం భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే మంత్రి పదవీకి (resign) రాజీనామా చేస్తానని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలోని వేర్ ఇస్ ది పార్టీ పాటకు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన దైన స్టైల్లో స్టెప్పులు వేసిన ఈ వీడియోను సింధు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..ఇప్పటికే 3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.
ఏప్రిల్ (April)నుంచి చేపట్టేందుకు రెండో విడత గొర్రెల పంపిణీని తెలంగాణ (Telangana) రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఎఫ్ఆర్బీఎం’ రుణ పరిమితి తేలిన తర్వాత ‘ఎన్సీడీసీ’(జాతీయ సహకార అభివృద్ధి సంస్థ) నుంచి ఎంత రుణం తీసుకోవాలి? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
పని గట్టుకుని తప్పుడు ప్రచారాలు, అసభ్యకర కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించాడు. యూట్యూబ్ చానల్స్ వాళ్లు ఇష్టారీతిన తన సొంత విషయాలపై కథనాలు ప్రసారాలు చేస్తున్నారని వాపోయాడు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఏకంగా పోలీసులను (Telangana Police) ఆశ్రయించాడు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, యూట్యూబ్ చానల్ నిర్వాకులను వదిలిపెట్టవద్దని స్పష్టం చేశాడు.
armoor mla jeevan reddy:ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (jeevan reddy) హత్యకు మరోసారి కుట్ర జరిగింది. ఇదివరకు ప్రసాద్ గౌడ్ (prasad goud) అనే వ్యక్తి కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అతనే కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు.