వేములవాడ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై, బీజేపీ పెద్దలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సింహం లాంటి వాడని, సింగిల్ గానే వస్తాడని అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే వేములవాడను దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు.
కాంగ్రెస్- సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. కొత్తగూడెం ఒక సీటు ఇస్తామని.. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ ఇస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పగా.. కమ్యూనిస్ట్ నేతలు అంగీకరించారు.
సీఎం కేసీఆర్ భూ దందాలకు పాల్పడుతున్నారని.. అసైన్డ్ భూములను కబ్జా చేశారని బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
పోలీసులు కేసీఆర్ ఎన్నికల సింబల్ అయిన అంబాసిడర్ కారును సీజ్ చేశారు. ఎంటి ఆశ్చర్యంగా ఉందా ఇది నిజం. అసలు విషయం ఏంటంటే కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా టీ-కాంగ్రెస్ రూపొందించిన గులాబీ కారు.. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకే రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది.
రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రేపు భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం సమాయత్తమవుతోంది. రేపు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ నిర్వహించనుంది.
కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోని 60 మంది అభ్యర్థులకు బీ-ఫాంలను అందించింది. నవంబర్ 10వ తేది వరకూ నామినేషన్లకు గడువు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ 100 మంది అభ్యర్థులను ప్రకటించగా మరో 19 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి త్వరలో ప్రకటించనుంది.
టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బకరా కాబోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయా నేతలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి మారతారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
ఎన్నికల సమయంలో ప్రజలు మోసపోవద్దని, అభ్యర్థిని చూసి కాకుండా ఆ పార్టీ చరిత్రలను చూసి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొత్తగూడ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్లొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటైన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అన్ని రంగాలను ముందుకు తీసుకొచ్చిందన్నారు. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓట్లేసి మళ్లీ బీఆర్ఎస్నే అధికారంలోకి తీసుకురావాలన్నారు.