కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగిపోయింది. దీనికి గల కారణం ఏంటో వివరణ ఇవ్వమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకు లేఖ రాసింది. కానీ వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి లేఖ రాస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రెండు చోట్ల ఓటు ఉన్న విషయం గుర్తించే సాప్ట్ వేర్ తమ వద్ద లేదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ను పార్టీ అజారుద్దీన్కు కేటాయిచింది. దాంతో పార్టీకి రాజీనామా చేయాలని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ రెండో జాబితాలో చోటు దక్కని పలువురు అసంతృప్తిగా ఉన్నారు.
ఖమ్మం జిల్లాలో పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శలు చేయగా ఆయన స్పందించారు. డిపాజిట్ రాని పార్టీని బలోపేతం చేసింది తాను కాదా అని నిలదీశారు.
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో 20వ పియర్ కుంగుబాటు నేపథ్యంలో దానికి సమీపంలోని అయిదారు పియర్స్కు స్వల్పంగా పగుళ్లు ఏర్పడినట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది.
బిత్తిరి సత్తి మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ను మించిన మెగా హీరో మరెవరు ఉంటారని కామెంట్ చేశారు.
రెండో విడత కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 6 రోజులపాటు బస్సుయాత్ర కొనసాగనుంది.
తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసి రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు.. వివిధ అంశాల ఆధారంగా 45 మందికి టికెట్ల కేటాయించింది.
కరీంనగర్ కలెక్టర్, సీపీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంది.
లోకల్, నాన్ లోకల్ అనే వాళ్లందరికి నేను ఇచ్చే సమాధానం ఒకటే అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వాలని బీజేపీ అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే సీఎంగా బీసీ వ్యక్తిని నియమిస్తామని ఆయన అన్నారు.
ఓడిపోయి ఇంట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుని పిలిచి మంత్రిని చేశానని.. కానీ ఆయన ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో చేరారు.
చోరీకి గురయిన మందు గుండు సామగ్రిని సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే పోలీసులు రికవరీ చేసి.. దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేశారు.