SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శతజయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి మాట్లాడుతూ.. సీపీఐ పార్టీ చరిత్ర ఎంతో గొప్పదని, నిరంతరం ప్రజా పోరాటాలు కొనసాగిస్తుందని, ఈనెల 30న నల్గొండ జిల్లాలో జరిగే సీపీఐ పార్టీ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
PDPL: నేత్రదానం మహా పుణ్యకార్యమని సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి భీష్మాచారి అన్నారు. గురువారం ఓదెల మండల కేంద్రానికి చెందిన నేత్రదాత బూర సదానందం సంస్మరణ సభను నిర్వహించారు. ఈసందర్భంగా నేత్ర, అవయవ, శరీర దానంపై అవగాహన కల్పించారు. అనంతరం నేత్రదాత కుటుంబ సభ్యులకు అభినందన పత్రాన్ని అందజేశారు.
కామారెడ్డి: పెద్ద కోడపగల్ మండల కేంద్రంలో గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు బైక్ ర్యాలీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ.. ఈ నెల 29న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గంలో నిర్వహించే బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
HNK: కాజీపేట మండలం మడికొండ ప్రధాన రహదారిపై నేడు లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో రాజేష్ అనే అయ్యప్ప స్వామి తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం రోడ్డు క్రాస్ చేస్తున్న రాజేష్ వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. కుడికాలు నుజ్జు నుజ్జు కావడంతో 108 సర్వీస్లో ఆసుపత్రికి తరలించారు.
KMM: చంద్రుగొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. సీసీ రోడ్ల శంకుస్థాపనలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వారు అన్నారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
SDPT: BRS రాష్ట్ర నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
NLG: చందంపేట మండలం ముడుదండ్ల గ్రామానికి చెందిన పందిరి జనార్ధన్ రెడ్డి మృతి బాధాకరమని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ముడుదండ్ల గ్రామంలో జనార్ధన్ రెడ్డి మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు ఉన్నారు.
NLG: నల్గొండ మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఈ నెల 28 తేదీన మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
NLG: నల్గొండ మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఈ నెల 28 తేదీన మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
MHBD: క్వారీ గుంతలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలిసులు అనుమానిస్తున్న ఘటన తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఉన్న చెప్పుల ఆధారంగా బాధితుడు అమ్మాపురం గ్రామానికి చెందిన హరీశ్(17)గా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MHBD: క్వారీ గుంతలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలిసులు అనుమానిస్తున్న ఘటన తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఉన్న చెప్పుల ఆధారంగా బాధితుడు అమ్మాపురం గ్రామానికి చెందిన హరీశ్(17)గా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ADB: దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ క్షేత్రంలో రాష్ట్ర టీపీసీఎఫ్, కాంపా ఉన్నతాధికారి సునీత పర్యటించారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఆమె తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ఉన్నారు.
KMM: సీపీఐ వందేళ్ల ఆవిర్భావ దినోత్సవాన్ని జానంపేటలో సీపీఐ శ్రేణులు జరుపుకున్నాయి. నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయోధ్య పార్టీ సీనియర్ నాయకులు పాకలపాటి చందు, తోగటి వీరభద్ర చారి మాట్లాడుతూ.. ఇప్పటికీ, ఎప్పటికీ పేదల పక్షాన వెన్నుదన్నుగా పోరాడేది తామేనన్నారు.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు అన్నారు. అభివృద్ధిలో భాగంగా ఏ అధికారి, నాయకునికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా 8096107107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఆయన అన్నారు.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు అన్నారు. అభివృద్ధిలో భాగంగా ఏ అధికారి, నాయకునికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా 8096107107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఆయన అన్నారు.