KNR: చిన్నారుల ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని RBSK వైద్యులు డాక్టర్ సురేశ్ సూచించారు. గంగాధర(M) ఆచంపల్లిలో సర్పంచ్ ఆరె. తేజశ్రీ ఆధ్వర్యంలో శుక్రవారం సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం వైద్యులు చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, బరువు తక్కువగా ఉన్న వారిని ఎన్ఆర్సీకి రిఫర్ చేశారు.
JGL: క్రీడలతో స్నేహ భావం పెంపొందుతుందని, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస అన్నారు. మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలో ఉమ్మడి మేడిపల్లి మండల క్రికెట్ ప్రీమియం లీగ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం అలవడుతుందన్నారు.
MDK: మెదక్ స్టేడియంలో సీఎం కప్-2025 సాఫ్ట్ బాల్ క్రీడలను అదనపు కలెక్టర్ నగేష్ ప్రారంభించారు. 25 జిల్లాల నుంచి 700 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రమేష్ గంగాల తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాధికారి విజయ, సైన్స్ అధికారి రాజిరెడ్డి, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి శోభన్ బాబు పాల్గొన్నారు.
వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణాలు అభివృద్ధి చేసుకుందాం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తూ ప్రజలు మరోసారి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని అన్నారు.
మెదక్ నుండి ఎల్లారెడ్డి నేషనల్ హైవే రోడ్డు పనుల్లో భాగంగా నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బంజారా గ్రామం నుండి తాండూర్ గేటు వరకు ఉన్నటువంటి ఫారెస్టులో గల చెట్లను కామారెడ్డి ఫారెస్ట్ డివిజినల్ ఆఫీసర్ రామకృష్ణ తనిఖీ చేశారు. అలాగే తాండూర్ గేటు సమీపంలో గల ఫారెస్ట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్లో గల 11వేల ఒక్క వంద సుమారు మొక్కలను పరిశీలించారు.
NLG: భారతీయ తపాలా సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద, నమ్మకమైన నెట్వర్క్ అని నల్గొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సంతోష్ నరహరి పేర్కొన్నారు. శుక్రవారం నర్సింగ్భట్ల పోస్టాఫీస్లో నిర్వహించిన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఆయన మాట్లాడారు. పోస్టాఫీస్లోని పలు ప్రభుత్వ పథకాలు, పొదుపు స్కీమ్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
RR: జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కందుకూరు మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై చర్చించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాలని తెలిపారు.
MHBD: తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొలగాని రాములు గురుకుల పాఠశాల విద్యార్థినిలకు డిగ్రీ కోర్సులపై అవగాహన కల్పించి తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందాలని తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొలగాని రాములు సూచించారు. శుక్రవారం గురుకుల పాఠశాల విద్యార్థినిలకు డిగ్రీ కోర్సులపై తెలియజేసి సక్రమమైన పద్ధతిలో బోధన ఉంటుందన్నారు.
BDK: జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ. రాహుల్ సందర్శించారు. డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అవసరమైన మెటీరియల్, పుస్తకాలు, ఆన్లైన్ క్లాసులకు ఐటీడీఏ తరఫున సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. చండ్రుగొండ, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో గ్రంథాలయాల ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
BDK: సారపాకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగ వెంకట్రెడ్డి(20) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుంటూరు జాతీయ రహదారిపై బైక్పై ప్రయాణిస్తున్న సమయంలో ముందు నిలిచిన వాహనాన్ని ఢీకొని పడిపోగా, వెంటనే వెనుక నుంచి వచ్చిన లారీ అతనిపై దూసుకెళ్లినట్లు సమాచారం. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఈ యువకుడి అకాల మరణంతో కుటుంబసభ్యులు, దిగ్భ్రాంతికి గురయ్యారు.
NGKL: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండిలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ADB: ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొలిపుర ప్రాంతంలో 7.5 క్వింటల్లా రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు CI సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. చిలుకూరి లక్ష్మీ నగర్కు చెందిన నిందితుడు షేక్ ఇమ్రాన్ అహ్మద్ ఆటోలో తరలిస్తుండగా పట్టుబడినట్లు వెల్లడించారు. ఆటో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
NZB: నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని ప్రమాణాలు పాటిస్తూ స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
SRD: భక్తి మార్గం ద్వారానే సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుందని నీలం మధు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరులో నూతన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఆధ్యాత్మికత పెరిగితే సోదరభావం వృద్ధి చెందుతుందని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్సై శరత్ నేతృత్వంలో శుక్రవారం కన్నారెడ్డి, జప్తి జానకంపల్లి తండాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 6 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.