• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అక్రమ కట్టడాలపై ఉన్నత స్థాయి కమిటీ : మంత్రి తలసాని

హైదరాబాద్‌ లో అక్రమ కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు మంత్రి తలసాని.  ఈ నెల 25న కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. నగరంలోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన స్పందించాయన్నారు. ప్రమాదం జరిగిన భవనంలో కెమికల్స్ ఉండటం వల్ల మంటలు తొందరగా అదుపులోకి రాలేదని ఆయన తెలిపారు. పక్కన ఉన్న బస్తీకి మంట...

January 20, 2023 / 05:52 PM IST

బీఆర్ఎస్ సభకు మజ్లిస్‌కు అందని ఆహ్వానం: రేవంత్ రెడ్డి

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో మజ్లిస్ హాజరు కాలేదు. ఎంఐఎంను సీఎం కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదో తెలియడం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసే ఉంటున్నాయని, జాతీయ వేదికను మాత్రం పంచుకోకపోవడం ఏంటీ, ఇందులో ఏదో జిమ్మిక్కు ఉందన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి పువ్వాడ అజయ్ కూడా...

January 20, 2023 / 05:17 PM IST

హైదరాబాద్ లో భారీ ఆఫీస్ స్థలాన్ని కొన్న దిగ్గజ సంస్థ

విశ్వనగరం దిశగా హైదరాబాద్ వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరుతున్నాయి. డేటా కేంద్రాలకు అడ్డాగా.. దేశంలోనే ఐటీకి ప్రధాన నగరంగా.. లైఫ్ సైన్సైస్, టీకాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువగా వస్తుండగా.. ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్ లో కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. ఇప్పటికే ప్రఖ్యాత సంస్...

January 20, 2023 / 04:55 PM IST

ఐదు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

జనవరి నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఇక వారంలో ఐదు రోజుల పని, పెన్షన్ అప్డేషన్, నేషనల్ పెన్షన్ స్కీం రద్దు, జీతాల పెంపు, ఖాళీల భర్తీ డిమాండ్లతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్...

January 20, 2023 / 04:51 PM IST

డీజీపీది ఏపీ క్యాడర్, అక్కడికి పంపించాల్సిందే: రఘునందన్ రావు

తెలంగాణ ఇంచార్జీ డీజీపీ అంజనీకుమార్ ఏపీ క్యాడర్‌కు చెందిన వారు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ అంశంపై తాను ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశానని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)...

January 20, 2023 / 04:46 PM IST

సికింద్రాబాద్ ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదు : శ్రీధర్‌

సికింద్రాబాద్ వద్ద షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదని విద్యుత్‌ శాఖ అధికారి శ్రీధర్‌ వెల్లడించారు. షార్ట్‌ సర్య్కూట్ జరిగుంటే విద్యుత్ సబ్ స్టేషన్‌లో ట్రిప్‌ అయ్యేదని, కానీ అలా జరగలేదని తెలిపారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లుగా ...

January 20, 2023 / 04:25 PM IST

ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ రోజు (శుక్రవారం) చేపట్టింది. 12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్‌పై వేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అధికారుల కేటాయింపునకు సంబంధించి ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని చీఫ్ జస్టిస్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. అన్ని పిటిషన్లప...

January 20, 2023 / 03:32 PM IST

చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారా… పవన్ మాటేమిటి?

నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను… కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు… ఇది చిరంజీవి ఇటీవలి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలో డైలాగ్ పెట్టారో కానీ నిజజీవితంలోను అదే కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లో ఫెయిల్యూర్ కావొచ్చు.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు కలిగిన నటుడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఆయన కోసం ఆశగా చూస్తుంటుందనడంలో ...

January 20, 2023 / 02:00 PM IST

ఖమ్మం సభ విజయవంతమైంది : పువ్వాడ అజయ్

ఖమ్మంలో నిర్వహించిన తమ బీఆర్ఎస్ పార్టీ సభ విజయవంతమైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు  లక్షలాదిగా హాజరయ్యారని ఆయన చెప్పారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రితో నిర్వహించిన సభ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. మైదానంలో చిన్నపాటి సముద్రం కనిపించిందన్నారు. మైదానం సరిపోక బయటే లక్షమంది దాక బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండిపోయారని తెలిపారు మంత...

January 20, 2023 / 01:51 PM IST

రాజాసింగ్‌కు మరోసారి నోటీసులు.. ఈసారి ఎందుకంటే?

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మంగళ్‌హాట్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని సయ్యద్‌ మహమూద్‌ అలీ గతేడాది ఆగస్టులో కంచన్ బాగ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కంచన్ బాగ్ నుంచి మంగళ్‌హాట్ స్టేషన్ మార్చారు. తాజాగా ఇచ్చిన నోటీసులపై రాజా సింగ్ స్పందించారు. పోలీసులు తనను అరెస...

January 20, 2023 / 01:23 PM IST

రూ.23 కోట్లతో ఆర్టీసీకి ఒక్కరోజు రికార్డుస్థాయి ఆదాయం

ఏపీఎస్ ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ నెల 18న ఒక్కరోజులో రూ.23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎర్నింగ్స్ సాధించిన రోజుగా రికార్డు నెలకొల్పింది. ఇందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో రికార్డుస్థాయి ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే గతంలో మాదిరి టిక్కెట్ ధరలను 50 శ...

January 20, 2023 / 01:16 PM IST

బీఆర్ఎస్ నెక్స్ట్ బహిరంగ సభ విశాఖలో, ఎందుకంటే?

ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సక్సెస్ అయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సభలు, పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన మొదటి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ కాపు నేత తోట చంద్రశేఖరరావును ఏపీ బీఆర్ఎస్ చీఫ్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సభను ప్లాన్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సభ ఎప్పుడు, ఎక్కడ అనేది త్వరల...

January 20, 2023 / 12:42 PM IST

అక్రమ నిర్మాణాలతోనే ప్రభుత్వానికి ఆదాయం

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాం గోపాల్ పేట అగ్నిప్రమాదం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్కార్ వద్ద డబ్బులు లేవని, అందుకే అక్రమంగా భవనాలకు పర్మిషన్ ఇస్తుందని తెలిపారు. ప్రమాదానికి గురయిన దక్కన్ మాల్ భవనాన్ని ఈ రోజు (శుక్రవారం) కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సహకారాలు అందించాలని కోరారు. కాలిపోయిన భవాన్ని కూల్చివేయాలన్నారు. ఆ భవనాలను కూల్చివేసే సమయంలో చుట్టుపక్కల ...

January 20, 2023 / 12:37 PM IST

చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారు : ఏపీ కాంగ్రెస్ ట్విస్ట్

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మెగాస్టార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చిరంజీవి రాజకీయాలకు దూరమంటున్నారు, పార్టీలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రుద్...

January 20, 2023 / 12:53 PM IST

సీఎం కేసీఆర్ పతనం షురూ : ఎమ్మెల్యే ఈటల

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పి, ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. జనాలకు కబుర్లు చెప్పి అధికారం చేపట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండబోదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నే చక్కదిద్దలేని కేసీఆర్ దేశాన్ని వెలగబెడతారా అని స...

January 20, 2023 / 12:53 PM IST