MDCL: అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయాలను సమర్థవంతంగా అందిస్తామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 2 లక్షల 25 వేల విలువైన ఎల్వోసీని అందజేశారు.
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
BDK: భద్రాచలం లో POW డివిజన్ కమిటీ మహిళ నాయకులు సమావేశమయ్యారు. పాయం రాజమ్మ పాల్గొని మాట్లాడుతూ.. మల్లన్న జాతరలో చాకలి కుటుంబంపై , ఐదు నెలల పసికందు ను కాలితో గొంతు నలిమి చంపడం దారుణమని మండిపడ్డారు. రెడ్డి దొరలు ఇప్పటివరకు హంతకులను పట్టు కోక పోవడం పోలీసులు హంతకుల కే కొమ్ములు కాయడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య సిగ్గుచేటు అన్నారు.
MDK: కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సుమలతకు రూ.53,000 విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కును జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి అందజేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ఈ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆమె తెలిపారు. వెంకటేశం, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని నజీరాబాద్ తండాలో పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య సందర్శించారు. తండాలో అండర్ డ్రైనేజ్, వీధి దీపాలు, సీసీ రోడ్లు, ఎక్కడ లేవో ఆ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలో ప్రతి ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా బుట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి వైస్ ఛైర్మన్ హనుమంతు పాల్గొన్నారు.
WNP: పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో మొబైల్ షాప్ దగ్ధం ఘలనలో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని మంగళవారం స్థానిక మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రావు తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, షాప్ నిర్వాహకుడు మహేశ్, వడ్డే ఈశ్వర్ తదితరులు పంచనామాకు హాజరై బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
NZ: నవీపేట్ మండలం బినోల, నందిగాం శివారుల్లో గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లో అమర్చిన నాలుగు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను దొంగిలించారు. రైతులు మంగళవారం ఉదయం గమనించి వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
NLG: నాగర్ కర్నూల్ జిల్లాలో చాకలి మహిళపై దాడి, రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన అమానుష ఘటనను నిరసిస్తూ మండలంలోని ఇర్కిగూడెంలో BC,SC,ST జేఏసీ ఆధ్వర్యంలో సంతాప సభ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. చిన్నారి మృతికి సంతాపం ప్రకటిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల నుంచి కంకర తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని సిరిసిల్ల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పృథ్వీరాజ్ వర్మ పట్టుకున్నారు. మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్ను గుర్తించి సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు తరలించి సీజ్ చేశారు.
VKB: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సోమ్లా NSS కంటింజెంట్ అధికారిగా, మరియు విద్యార్థి ప్రవీణ్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్కు ఎంపికయ్యారు. ఈరోజు నుంచి మార్చి 2 వరకు కర్ణాటకలో జరగనున్న ఈ శిబిరానికి వీరు వెళ్లనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయం తరపున మొత్తం 10 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు.
RR: మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ కాలనీల అధ్యక్షులు తమ కాలనీలలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల పై గతంలో వినతి పత్రాన్ని రాష్ట్ర TUFIDC ఛైర్మన్ చల్ల నరసింహ రెడ్డికి అందచేశారు. ఈరోజు జోనల్ కమీషనర్ చంద్రకళతో కలిసి కాలనీలో పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.
GDWL: గద్వాల పాత కూరగాయల మార్కెట్ సమీపంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో మేకపోతు అక్కడికక్కడే మృతి చెందగా, దాన్ని పట్టుకున్న వ్యక్తికి కూడా విద్యుత్ ఘాతంతో గాయాలయ్యాయి. రోడ్డుపై వేలాడుతున్న విద్యుత్ తీగలు లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఇలా జరగడంతో ప్రజలు భయపడ్డారు.
MNCL: వ్యాధులతో బాధపడేవారు మందులను క్రమం తప్పకుండా వాడాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సూచించారు. ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ ఆదేశాల మేరకు మంగళవారం రాంపూర్ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు.
NRML: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా,పారదర్శకంగా జరిగేలా అన్ని 23 పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.