NRPT: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగిరం చేసి జిల్లాలో వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం మరికల్, అప్పంపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ పరిశీలించారు. మండలంలో 61 శాతం సర్వే పూర్తైందని ఎంపీడీవో కొండన్న కలెక్టర్కు వివరించారు. సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
NGKL: కొడంగల్ నియోజవర్గంలోని దౌల్తాబాద్ పరిధిలో వేట వలలో భారీ కొండ చిలువ చిక్కింది. మండల కేంద్రంలోని దౌల్తాబాద్, రాళ్లపల్లి మధ్యలో ఉన్న అడవి సమీపంలో కొందరు వేటకు వేసిన వలలో కొండ చిలువ చిక్కింది. ఆదివారం వెళ్లిన వేటగాళ్లు వలలో చిక్కిన కొండ చిలువను చూసి వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కొండ చిలువను పట్టుకున్నారు.
JGL: మావోయిస్టు దళంలో చేరిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మెట్పల్లి డీఎస్పీ రాములు కౌన్సెలింగ్ నిర్వహించారు. కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరు తిరుపతి కొద్ది కాలం క్రితం మావోయిస్టులకు చెందిన ఓ దళంలో చేరగా విషయం తెలుసుకున్న డీఎస్పీ సీఐ సురేశ్ బాబుతో కలిసి వారి ఇంటికి వెళ్లి వారికి నిత్యవసర సరుకులను అందజేశారు. తిరుపతిని జన జీవన స్రవంతిలో కలిసేలా చూడాలన్నారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకునే రైళ్లు ఏ ఫ్లాట్ ఫాం వైపు వస్తాయనేది కేవలం 15 నుంచి 20 నిమిషాల ముందు మాత్రమే ప్రకటిస్తున్నారు. అప్పటి దాకా ప్రయాణికులు ఆగాల్సిందే.. ఎటు వస్తుందో తెలియక ప్రయాణికులు ఎంట్రన్స్ బోర్డు వద్దకు వచ్చి గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఒక్కోసారి చివరి క్షణంలో ఫ్లాట్ ఫాం నంబర్ మారుతోంది.
MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం మున్సిపల్ 31వ వార్డులో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. సర్వేకు వచ్చే వార్డు ఆఫీసర్, కమిటీ సభ్యులకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.
NGKL: నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవిని విద్యుత్ ఎంప్లాయిస్ 327 నాయకులు ఆదివారం కలిశారు. జనవరి 4న గద్వాలలో జరిగే యూనియన్ డైరీ ఆవిష్కరణకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం అందజేశారు. అంతకుముందు ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ.. డైరీ ఆవిష్కరణకు తప్పనిసరిగా హాజరవుతానని చెప్పారు.
HNK: కాశ్మీర్లో ఇటీవల సబ్ జూనియర్ నేషనల్ సాప్ట్బాల్ ఛాంపియన్ షిప్లో ఆరేపల్లె గ్రామానికి చెందిన ఎస్.కే గుల్షన్, బి.లక్ష్మి ప్రసన్న గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్దులను వర్ధన్నపేట ఎమ్మెల్యేకే ఆర్ నాగరాజు అభినందించారు. ఈ సందర్భంగా ఆదివారం హనుమకొండ జిల్లా సుబేదారి ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయంలో విద్యార్థులకు మెడలో గోల్డ్ మెడల్ వేశారు.
BDK: జనాభాకు తగిన విధంగా రాజకీయ అవకాశాలను బీఎస్పీ అందిస్తుందని భద్రాచలం నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి, చర్ల మండల ఇంఛార్జ్ సామల ప్రవీణ్ అన్నారు. చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బీఎస్పీ పార్టీలో ఇటీవల చేరిన కొండా కౌషిక్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు.
PDPL: గోదావరిఖని పట్టణం రమేశ్ నగర్కు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఆదివారం పొలం బాట పట్టారు. వరి పంట ఎలా వేస్తారు, పొలం, నారుమడి, నాట్లు తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు నేరుగా పంట పొలాలకు తీసుకువెళ్లారు. పాలకుర్తి మండలం ఎల్కలపల్లి పంట పొలాలలో స్వయంగా విద్యార్థులు నాట్లు వేశారు.
NLG: మిర్యాలగూడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వీరావత్ రాగ్య నాయక్ 23వ వర్ధంతి ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాజ్య నాయక్ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని, గిరిజనులకు అనేక సేవలు చేశారని గుర్తు చేశారు.
JGL: జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 12 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం వారికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేశారు. నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి: సదాశివనగర్ మండల కేంద్రంలో ఇటీవల చిట్టెపు శ్రీనాథ రెడ్డి మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని బీజేపీ నాయకుడు పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించారు. శ్రీనాథ రెడ్డి భార్యకి ఉద్యోగం కల్పిస్తానని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు.
NRML: తెలంగాణా రాష్ట్ర మోచి సంఘం ఎన్నికలలో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ కావలి సంతోష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంఘం సభ్యులు, కులస్తులు ఓటు హక్కును వినియోగించుకోవాలని వైస్ ఛైర్మన్ కావలి సంతోష్ కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
HYD: న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. జూబ్లీహిల్స్లో మొత్తం 36 పబ్లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్లలో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
HYD: నిమ్స్ సమాచార సేకరణ కోసం వెళ్లే జర్నలిస్టులకు సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం వైద్యులు ఇంటర్వ్యూలు, దవాఖానలో విజయవంతమైన ఆపరేషన్లు, వివిధ వైద్య విభాగాలకు సంబంధించిన అవగాహన సదస్సులు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే జర్నలిస్టులు పార్కింగ్తో పాటు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.