• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పోతిరెడ్డిపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం

JN: పోతిరెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజలు, రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సమస్యల సత్వర పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

April 15, 2026 / 02:28 PM IST

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఛైర్‌పర్సన్

MHBD: మరిపెడ పట్టణానికి చెందిన లబ్దిదారులకు CMRF చెక్కులను మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, నేతలు పంపిణీ చేశారు. ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

April 15, 2026 / 02:26 PM IST

సోలార్ వినియోగంలో మన మేడ్చల్ NO.1

MDCL: మేడ్చల్ జిల్లా సౌర విద్యుత్ వినియోగంలో రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలిచింది. గృహాలు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర ప్యానెల్స్ ఏర్పాటు వేగంగా పెరుగుతోంది. విద్యుత్ ఖర్చులు తగ్గడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ విజయానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయ భవనాలపై సైతం ఏర్పాటు చేశారు.

April 15, 2026 / 02:25 PM IST

రేపు మండల ప్రత్యేక సమావేశం

WNP: ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో రేపు (గురువారం) మండల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీపాద తెలిపారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామసభల్లో సేకరించిన పథకాల అమలు, లబ్ధిదారుల అభిప్రాయాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు, వార్డు సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.

April 15, 2026 / 02:23 PM IST

నీటి కొరతతో పశువుల విలవిల

MNCL: లక్షెట్టిపేట తాలుకా పరిధిలోని వివిధ మండల కేంద్రాలలో రోడ్లపై సంచరిస్తున్న మూగజీవాలు దప్పికతో విలవిలాడుతున్నాయి. దండేపల్లి, లక్షెట్టిపేట, జన్నారం మండలాల్లో ఉన్న ప్రధాన రహదారిపై ఎక్కువగా మూగజీవాలు సంచరిస్తున్నాయి. అయితే ఎండల తీవ్రత 43 డిగ్రీలకు చేరడంతో అవి నీటి కోసం ఇబ్బంది పడుతున్నాయి. మండల కేంద్రాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.

April 15, 2026 / 02:21 PM IST

ప్రవేశ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ సెంటర్

ASF: కాగజ్‌నగర్‌ పట్టణంలోని డివిజనల్ రిసోర్స్ సెంటర్‌లో నిర్వాహస్తున్న కోచింగ్ సెంటర్ ను ఇవాళ కలెక్టర్ హరిత ప్రారంభించారు. SSC ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం పాలిసెట్, TGSWR, RJCCET ఉచిత కోచింగ్ సెంటర్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నియోజకవర్గ విద్యార్థులు ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 15, 2026 / 02:18 PM IST

మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలి

MNCL: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మంచి సేవలు అందించాలని లక్షెట్టిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ దొంత అంజలి, వైస్ ఛైర్‌పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, సీడీపీవో రేష్మ కోరారు. ఇవాళ పట్టణంలోని సీడీపీవో కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన 109 మంది అంగన్వాడి టీచర్లకు సరఫరా చేసిన సెల్‌పోన్‌ల పంపిణీ, పోషన్ పక్వాడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

April 15, 2026 / 02:18 PM IST

పశువులు తోలేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు..!

JGL: వెల్గటూర్ మండలంలోని కప్పారావుపేట గ్రామ చెరువులో మునిగి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ముక్కట్రావుపేటకు చెందిన అంకతి పెద్ద కోటయ్య(65) మంగళవారం పశువులు మేపేందుకు వెళ్లాడు. చెరువులోకి దిగిన పశువులను తోలేందుకు నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పీ.ఉదయ్ కుమార్ తెలిపారు.

April 15, 2026 / 02:14 PM IST

ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం

KMR: పిట్లం జాతీయ రహదారి 161పై బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పిట్లం వైపునకు పాత ఇనుప సామాను లోడ్‌తో వెళ్తున్న ఆటో గుద్దుడుతండా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, అందులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.

April 15, 2026 / 02:12 PM IST

ఈనెల 19న జిల్లాస్థాయి చదరంగం పోటీలు

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-7, 11 బాలబాలికల చదరంగం ఎంపిక పోటీలు ఈనెల 19న నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షడు జనార్దన్ రావు, కార్యదర్శులు  స్వామి తెలిపారు. స్థానిక చాణక్య ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల వారు 18వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాలకు 6281966588 ఈ నంబర్ ను సంప్రదించాలని కోరారు.

April 15, 2026 / 02:10 PM IST

CMRF చెక్కులను పంపిణీ చేసిన కార్పొరేటర్

NLG: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ మామిడి కార్తిక్ పేర్కొన్నారు. ఈ రోజు డివిజన్‌లోని పలువురి లబ్ధిదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొంత ఆర్థిక భరోసాని ఇస్తుందని తెలిపారు.

April 15, 2026 / 02:10 PM IST

ఈనెల 19న జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ

KMM: జిల్లాలో ఈనెల 19న బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ ఏర్పాటు చేసినట్లు మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొంటారని ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు హరీష్ రావు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. BRS శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన సూచించారు.

April 15, 2026 / 02:10 PM IST

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శ్రీకారం

BDK: అశ్వాపురం మండలం, సీతారాంపురం గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామాలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కొత్త భవనం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తుందని పేర్కొన్నారు.

April 15, 2026 / 02:07 PM IST

‘SMలో అనవసర పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోం’

MBNR: సామాజిక మాధ్యమాలలో అనవసర పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోమని ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు నరేందర్ చారి అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ సభ్యుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఒకరికొకరు విమర్శించుకోవడం మూలంగా జర్నలిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అలాగే జర్నలిస్టులు వ్యక్తిగత దూషణలకు దిగవద్దన్నారు.

April 15, 2026 / 02:07 PM IST

పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. నిలిచిన విద్యుత్ సరఫరా

VKB: మిట్టకోడూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రతకు తోడు వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటల వేడికి విద్యుత్ తీగలు కాలిపోవడంతో గ్రామంలో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది.

April 15, 2026 / 02:05 PM IST