VKB: బంట్వారం మండలం నాగ్వారం సర్పంచ్ ఎన్నిక ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు భాగ్యమ్మ కేవలం రెండు ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. కౌంటింగ్ ముగిసే వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరుల ఆమె సర్పంచ్గా గెలుపొందడంతో కాంగ్రెస్ వర్గాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.
మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లిడి సర్పంచ్గా కర్నె మమత గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ఆమె సమీప అభ్యర్థులపై 165 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
JGL: రూరల్ మండలంలోని వెల్దుర్తి సర్పంచ్ గా పల్లె లక్ష్మి తన సమీప అభ్యర్థిపై 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
JGL: కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బండ నరసింహారెడ్డి- వినీల బీజేపీ మద్దతుదారు గెలుపొందారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా పని చేస్తానని నూతన సర్పంచ్ తెలిపారు. ప్రజల సహకారంతో అప్పారావుపేటను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.
SDPT: సిద్దిపేట జిల్లాలో 3వ విడత ఎన్నికలు ఈనెల 17వ తేదీన ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించనున్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి దూల్మిట్ట, కొండపాక, కుక్కునూరుపల్లి మండలాలలోని గ్రామాలలో ఈనెల 15వ తేదీన సాయంత్రం 5:00 గంటల వరకు ప్రచారానికి అనుమతి ఉన్నదని ఎన్నికల అధికారి కే.హైమావతి తెలిపారు.
HYD: నగరంలోని రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ‘జయజయహే తెలంగాణ గేయం పాడమంటే SPB నిరాకరించారట. అందుకే ఆయన విగ్రహా ఏర్పాటును నేను వ్యతిరేకిస్తున్నా. ఈ విషయంలో తెలంగాణ వాదుల పక్షాన నేను నిలబడతా. ఆయన విగ్రహం ఏర్పాటుకు మరో మంచి ప్లేస్ చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.
HYD: నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హైదరాబాద్-సైబరాబాద్ పోలీసులు ఆయా కమిషనరేట్ల పరిధిలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్ నిర్వహించారు. నిన్న, ఇవాళ చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో HYD-460, CYB-426 మంది పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. వాహనాలను సీజ్ చేసి పట్టుబడ్డ మందుబాబుల మీద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపర్చనున్నట్లు వారు స్పష్టం చేశారు.
PDPL: జూలపల్లి మండలం వెంకట్రావు పల్లె గ్రామ సర్పంచిగా మచ్చ అరుణ యాదగిరి 18 ఓట్ల మెజార్టీతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆదివారం గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠ భరితంగా వేచి చూస్తున్నారు. తాను గెలిపించిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
HYD: మహానగరంలో కనీసం మంచినీళ్లు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ‘యాకుత్పురలో మంచినీటిలో మురుగునీరు కలిసి వస్తోంది. ఖైరతాబాద్లో మంచినీరు దుర్వాసన వస్తుంది. ఈ ఫిర్యాదులను జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వెంటనే అధికారులు పరిష్కారం చూపారు’ అని ఆమె అన్నారు.
ADB: తాంసి మండల పరిధిలోని 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని బండాల నాగపూర్ సర్పంచ్గా గోలి పుష్పల విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కుంటాల లతపై 254 ఓట్ల తేడాతో గెలుపొందారు. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 3 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన 1976-77 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 48 ఏళ్ల తర్వాత తమ తోటి మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు చెప్పుకొచ్చారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరి కష్ట సుఖాలను మరొక్కరు అడిగి తెలుసుకున్నారు.
SRD: ఐఐటీలో చదివే విద్యార్థులు ప్రాజెక్టుల్లో టెన్షన్తో ఉంటారని వీరికి క్రీడల అవసరమని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పుల్లెల గోపీచంద్ అన్నారు. కంది సమీపంలోని ఐఐటీలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఆకట్టుకుందని చెప్పారు. జాతీయ స్థాయి క్రీడలు రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
KNR: తిమ్మాపూర్ మండలం రాంహనుమానగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పిస్క సౌజన్య విజయం సాధించారు. బీజేపీ మద్దతు గ్రామ సర్పంచిగా పోటీ చేసే విజయం సాధించారు. సౌజన్య విజయం రాంహనుమానగర్ గ్రామంలో బీజేపీకి నూతనోత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. సర్పంచిగా గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ADB: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే గెలుపు ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. ఆమె ఆదివారం గాదిగూడ మండలంలో పర్యటించి పార్టీ నాయకులతో మాట్లాడారు. సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు.
SRPT: చివ్వెంల మండలం సూర్య నాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి ధరావత్ కుమారి యాదగిరి నాయక్ 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కుమారి యాదగిరి నాయక్ ఈ సందర్భంగా తెలిపారు.