• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎండాకాలంలో అప్రమత్తంగా ఉండాలి

NRML: జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సాధారణ స్థాయికి మించి 1.5°C నుండి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని, వచ్చే వారం రోజుల పాటు వేడి గాలులు (హీట్‌వేవ్) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని అమె తెలిపారు.

April 15, 2026 / 03:19 PM IST

రోడ్డు ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన డీజీపీ

కామారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాద ప్రాంతాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. జంగంపల్లి, కుప్రయల్, టెక్రయల్ తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాద స్పాట్‌లను పరిశీలించారు. ఆ స్పాట్‌లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని సమాలోచనలు చేశారు. ఆయన వెంట ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నరసింహరెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారు.

April 15, 2026 / 03:16 PM IST

యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ లక్ష్యం

MNCL: ఏడు రోజుల తన జర్మనీ పర్యటనలో రాష్ట్రంలోని యువతకు వివిధ రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇవాళ మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనకు అవసరమైన నిధులను కేటాయించి, యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

April 15, 2026 / 03:15 PM IST

’16న మండల స్థాయి సమావేశం’

JGL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 16న పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డిఫంక్షన్ హాల్లో మండల స్థాయి ప్రత్యేక సమావేశం ఉన్నట్లు ఎంపీడీవో శశి కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరుకావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై వివరిస్తారని పేర్కొన్నారు.

April 15, 2026 / 03:15 PM IST

గుడిహత్నూర్ లో పర్యటించిన ఎంపీ గోడం నగేశ్

ADB: గుడిహత్నూర్ మండలంలో ఎంపీ గోడం నగేశ్ ఇవాళ పర్యటించారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు నీలకంఠ మహారాజ్ అన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మనోధైర్యంతో ఉండాలని వారిని కోరారు.

April 15, 2026 / 03:11 PM IST

గ్రేటర్ HYD పరిధిలో వేసవిలో అభివృద్ధికి శ్రీకారం

HYD: గ్రేటర్ HYD పరిధిలో ట్రాఫిక్ సమస్యల నివారణకు రోడ్ల విస్తరణతో పాటు, పలు అభివృద్ధి చర్యలకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్కులు, ఓపెన్ జిమ్స్, స్మశాన వాటికలు, ఆట స్థలాలు, స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేపడుతున్నారు. కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, ఆడిటోరియంలు, కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణంతో నగర మౌలిక వసతులను మెరుగుపరచాలన్నారు.

April 15, 2026 / 03:10 PM IST

8 నెలలుగా ముందుకు పడని అభివృద్ధి పనులు

MDCL: బోడుప్పల్-చెంగిచెర్ల అభివృద్ధి పనులు రూ.8 కోట్ల వ్యయంతో ప్రారంభమైనప్పటికీ, 8 నెలలు గడిచినా పనులు ముందుకు సాగకపోవడం స్థానికులను ప్రశ్నిస్తున్నారు. పనుల ఆలస్యంతో రోడ్ల దుస్థితి మరింత దిగజారగా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

April 15, 2026 / 03:07 PM IST

కవల పిల్లలు.. ఇద్దరికీ సమాన మార్కులు

JGL: జగిత్యాల సాయిరాంనగర్‌కు చెందిన ఎలగందుల శ్రావణ్-వినోద దంపతులకు సాయివర్షిత్, సాయివైభవ్ అనే కవలలు జన్మించారు. చిన్నప్పటి నుంచి వారు ఇద్దరూ ఒకే క్లాసు చదువుతున్నారు. అయితే విచిత్రమేమిటంటే ఇంటర్‌లో వారిద్దరికి సమాన మార్కులు రావడం. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో MPCలో ఇద్దరికీ సమానంగా 451 మార్కులు వచ్చాయి.

April 15, 2026 / 03:07 PM IST

మూడు జిల్లాల్లో నాలుగు వేలకుపైగా స్లాట్ బుకింగ్స్

RR: మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గత నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల కోసం 4 వేలకుపైగా స్లాట్ బుకింగ్స్ నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగడం, ఆస్తుల కొనుగోలు విక్రయాలు అధికమవడం దీనికి కారణంగా అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానం వల్ల పారదర్శకత పెరిగి, ప్రజలకు సులభంగా సేవలు అందుతున్నాయి.

April 15, 2026 / 03:07 PM IST

RRR సౌత్ ఏరియా DPR సిద్ధం అవుతోంది: నితిన్ గడ్కరీ

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (RRR) సౌత్ భాగానికి డీపీఆర్ సిద్ధం అవుతోందని రాష్ట్రానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగర ట్రాఫిక్ సమస్యలు తగ్గి, పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాలకు ఊతం లభించనుంది. ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పూర్తైతే రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

April 15, 2026 / 03:04 PM IST

HYD నుంచి ORR వరకే మన సిటీ బస్సులు

HYD: దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను సమీప డిపోలకు పంపనున్నారు. HYD నగర ట్రాఫిక్ తగ్గించేందుకు సిటీ బస్సులను హైదరాబాద్ ORR వరకు మాత్రమే నడపనున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టి పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులతో ట్రాఫిక్ నియంత్రణతో పాటు, ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడనున్నాయని అధికారులు తెలిపారు.

April 15, 2026 / 03:03 PM IST

లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు

ASF: ఆసిఫాబాద్, రెబ్బెన మండలాలలో MLA కోవ లక్ష్మి ఇవాళ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయా మండలాలకి చెందిన లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడబిడ్డలు కలిగిన నిరుపేద తల్లిదండ్రులకు ఇబ్బంది కావద్దని మాజీ సీఎం KCR ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు.

April 15, 2026 / 03:03 PM IST

జయంతికి రావాలంటూ ఎమ్మెల్యేకు ఆహ్వానం

GDWL: పట్టణంలోని పిల్లిగుండ్ల శ్రీ ముడువుల ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 21న నిర్వహించనున్న ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని వేద బ్రాహ్మణులు కోరారు. బుధవారం గద్వాల క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇందులో ప్రధాన అర్చకులు సాగర్ స్వామి కూడా ఉన్నారు.

April 15, 2026 / 03:01 PM IST

గ్రామంలో తాగునీటి సమస్యలకు చెక్

SRD: వేసవికాలంలో ప్రజల తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ ఆకాష్ తెలిపారు. బుధవారం కంగ్టి మండలం S.హ్యాంగిర్గ గ్రామంలో రెండు కాలనీలో ఏర్పాటుచేసిన మినీ వాటర్ ట్యాంకులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు తాగునీటిని తీసుకెళ్లారు. అయితే మరో రెండు చోట్ల కొత్త ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

April 15, 2026 / 03:01 PM IST

‘రెడ్డి సంఘం’ నూతన కార్యవర్గం ఎన్నిక

SDPT: నంగునూరులో నిర్వహించిన శ్రీమాతా రెడ్డి సంఘం సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వల్లపురెడ్డి రజినికర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తుమ్మకోలు మహేందర్ రెడ్డి, కోశాధికారిగా రేకులపల్లి వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పప్పు రాజారెడ్డి, చింతల సంతోష్ రెడ్డి, కార్యదర్శిగా మెతుకు రాజిరెడ్డి బాధ్యతలు చేపట్టారు.

April 15, 2026 / 03:00 PM IST