• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పింఛన్ల కోసం ధన్వాడలో రాస్తారోకో

NRPT: ధన్వాడ మండల కేంద్రంలో పింఛన్లు సక్రమంగా చెల్లించడం లేదని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు శనివారం మహబూబ్ నగర్-నారాయణపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారం రోజుల్లో ఇది రెండోసారి అన్నారు. ఎస్సై వెంకటేష్ గౌడ్ జోక్యంతో పోస్టల్ అధికారులకు పింఛన్లు వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం నిరసన విరమించారు.

April 4, 2026 / 02:40 PM IST

MBNR:రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: కాకర్లపహాడ్ వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి, పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తిని గుర్తించిన వారు ఎవరైనా ఉంటే నవాబుపేట ఎస్సై విక్రమ్‌కు ఫోన్ ద్వారా 8712659340 సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

April 4, 2026 / 02:40 PM IST

నిజాంసాగర్‌లో 9.25 టీఎంసీల నీటి నిల్వ

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1397.91 అడుగుల మేరకు 9.25 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ సాకేత్ తెలిపారు. మొత్తం 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు) సామర్థ్యానికి గాను, 1397 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం నీటి విడుదలను 1000 క్యూసెక్కులకు తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు.

April 4, 2026 / 02:39 PM IST

‘బీజేపీ అధికారమే మా లక్ష్యం’

KNR: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం ఇల్లందకుంటలో జరిగిన సీతారామచంద్రస్వామి రథోత్సవంలో ఆయన పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నదే తమ అభిమతమని పేర్కొన్న ఆయన, రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి రథాన్ని లాగారు.

April 4, 2026 / 02:37 PM IST

ధర్మపురి సంజయ్​కి పదవి ఇవ్వాలని నిరాహార దీక్ష

NZB: మాజీ మంత్రి డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్​కు పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు శనివారం డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్​ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఆయన అభిమానులు మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్​కు గుర్తింపు ఇవ్వాలని కోరారు.

April 4, 2026 / 02:36 PM IST

పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన

SRPT: కోదాడ పట్టణం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రైతులు మల్లు వెంకట్ రెడ్డి, మల్లు సైదిరెడ్డి, మల్లు యేసు రెడ్డి, వారి కుటుంబ సభ్యులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. శ్రీరంగాపురం గ్రామ శివారులో తాము సాగు చేసుకుంటున్న మూడు ఎకరాల పొలంలో చేతికొచ్చిన పంటను అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్లతో తొక్కించారని ఆరోపించారు.

April 4, 2026 / 02:35 PM IST

కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ: కైలాష్

NLG: దేవరకొండలో శనివారం జరిగిన ఐఎన్‌టీయూసీ నియోజకవర్గ స్థాయి సదస్సులో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. అన్ని రంగాల్లోని గ్రామీణ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

April 4, 2026 / 02:33 PM IST

దమ్మపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా మండల కేంద్రంలో పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఇటీవలే మరణించిన పలు కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే పలువురుని కలిసి సమస్యలు అడిగే తెలుసుకున్నారు.

April 4, 2026 / 02:33 PM IST

పేకాట స్థావరాలపై పోలీసుల పంజా

GDWL: ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామ శివారులో శనివారం బొమ్మ-బొరుసు ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ​సీఐ ఆధ్వర్యంలో ఇటిక్యాల ఎస్సై రవి, కోదండపురం ఎస్సై తరుణ్ కుమార్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ దాడుల్లో జూదరుల నుండి రూ.93,200 నగదుతో పాటు 8 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.

April 4, 2026 / 02:32 PM IST

‘పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు హర్షనీయం’

ADB: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయడం హర్షనీయమని రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ అన్నారు. పట్టణంలో శనివారం ఆయన మాట్లాడారు. ఈ విషయమై గత సంవత్సరం డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఫూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు.

April 4, 2026 / 02:28 PM IST

HPV వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించిన DIO

KMR: బాన్సువాడ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన HPV వ్యాక్సినేషన్ సెంటర్ను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రోహిత్ శనివారం సందర్శించారు. ఇప్పటివరకు బాలికలకు అందించిన వ్యాక్సినేషన్ టీకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పలు రిజిస్టర్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. బాలికల తల్లిదండ్రులకు, ప్రజలకు HPV వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై వివరించాలన్నారు.

April 4, 2026 / 02:26 PM IST

రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: వరంగల్ త్రీ-నగర పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిపిన ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రజల్లో మంచి చైతన్యం తీసుకువస్తుందని అన్నారు.

April 4, 2026 / 02:23 PM IST

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ విమర్శలు తగవు

MBNR: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ విమర్శలు తగవని జిల్లా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హరీష్ రావు మాట్లాడిన మాటలు అర్థరహితంగా ఉన్నాయని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారన్నారు.

April 4, 2026 / 02:22 PM IST

దేవరకొండలో “రన్ ఫర్ జీసస్” ర్యాలీ

NLG: దేవరకొండలో రన్ ఫర్ జీసస్ ర్యాలీని శనివారం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి దూతగా ఏసు మార్గంలో శాంతి స్థాపనే లక్ష్యంగా పయనిస్తున్న క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాస్టర్స్, కన్వీనర్స్ పాల్గొన్నారు.

April 4, 2026 / 02:22 PM IST

అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు మృతి

MBNR: జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు రామకృష్ణ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నిరుపేద అయిన బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

April 4, 2026 / 02:22 PM IST