NZB: ఆర్మూర్ మండలం మగ్గిడి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని అమూల్య (జీజీ కాలేజీ) జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పీడీ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న జూనియర్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో అమూల్య పాల్గొంటున్నట్లు తెలిపారు.