హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో రేపు సన్రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాదు స్టేడియంలోనికి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషేధమని ప్రకటించారు.
రాష్ట్రంలో ఎస్ఐ, ఏఏస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష (Written Exam) తేదీలు వెలువడ్డాయి. ఏప్రిల్ 8, 9వ తేదీలలో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) నిర్ణయించింది. ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్ (Arithmetic),మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ...
తెలుగు సినిమాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, తెలంగాణ యాసలో చిత్రీకరిస్తున్న సిమాలపై మంత్రి కేటీఆర్ ( Minister KTR ) ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ( CM KCR )కు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవనానికి కారణమైన కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కేటీఆర్ తెలిపారు.
Bandi Sanjay : తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ ట్వీట్స్ చేశారు.
దేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం వెల్లడించింది. మధ్య, తూర్పు, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ హీట్వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు TSPSC కార్యదర్శి సెక్రటరీ అనితా రామచంద్రన్(Anita Ramachandran)కి ఏప్రిల్ 1న హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె నేడు సిట్ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సెక్రటరీ నుంచి అధికారులు వాంగ్మూలాన్ని స్వీకరిస్తున్నారు.
ప్రగతి భవన్ మార్చ్కు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఈ రోజు పార్టీ అధినేతలకు ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచి నరేంద్ర మోదీ ప్రజలపై గుదిబండ మోపుతున్నారని మండిపడ్డాయి. ఇప్పుడు టోల్ చార్జీలు కూడా పెంచి అన్నింటి ధరలు పెరగడానికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధిక ధరలతో సామాన్యుడు జీవించలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. గులాబీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తేలుతోంది. కాగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
తెలంగాణలో BRS పార్టీ భ్రష్టాచార్ రిశ్వత్ సర్కార్గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp nadda) శుక్రవారం పేర్కొన్నారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ(telangana)ను..నేడు రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేవిధంగా బీఆర్ఎస్(BRS) చేసిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి రాష్ట్రంలో అధికారంలో కొనసాగే హక్కు లేదని నడ్డా అన్నారు. తెలంగాణ, ఏపీలో బీజేపీ జిల్లా కార్యాలయాలను వర్చువల్ విధాన...
తెలంగాణ ఎంసెట్(telangana eamcet 2023) పరీక్ష తేదీ షెడ్యూల్లో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే నీట్ యూజీ, tspsc ఎగ్జామ్స్ ఉన్న క్రమంలో వీటిని మార్పు చేశారు.
TSPSC ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(revanth Reddy).. మంత్రి KTRపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు రూ.100 కోట్లు ఇచ్చి ఏంతైనా తిట్టికోవచ్చా అంటూ ఎద్దేవా చేశారు. సినిమా కోసం రకుల్ సంతకం పెట్టినట్లు, సమంత వెబ్ సిరీస్ కోసం ఒప్పుకున్నట్లు కాదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.