PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం పెరగడంతో పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీ.లకు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ కూడా అంతే ఉంది. గురువారం సాయంత్రం ప్రాజెక్టులోకి 16,943 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా, ఇరిగేషన్ అధికారులు అదే మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో 3 గేట్లు ఎత్తి 16,539 విడుదల చేయనున్నారు.