WNP: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తుచేసుకున్న వారి వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆదర్శ్ సురభి అగ్రహం వ్యక్తం చేశారు. పీఎం ఆవాజ్ యోజన గ్రామీణ సర్వేపై MPDOలతో బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో L 1 కింద 39,643 కుటుంబాలు ఉండగా, వాటిలో 30% మాత్రమే పూర్తి చేయడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.