ADB: ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో బుధవారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ మాట్లాడుతూ.. చిన్న వయసులో ప్రధానమంత్రిగా ఎన్నికై దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన రాజీవ్ గాంధీని ప్రజలు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారన్నారు.