MNCL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ళలోపు చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్బీఎస్కే బృందాలతో 37,920 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.