MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. కౌడిపల్లి ఎంపీపీ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నిబంధనలకు లోబడి ఎన్నికలలో ఖర్చులు చేయాలని సూచించారు. రూ.50 వేలకు మించి డబ్బులు వెంట తీసుకు వెళ్లవద్దని, అందుకు సరైన ఆధారాలు ఉండాలన్నారు.