KMM: YSR హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు హౌసింగ్ కార్పోరేషన్ను రద్దు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పేద ప్రజలకు భరోసా, ధైర్యం అందించేలా ఇందిరమ్మ ఇళ్లును ప్రజా ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు. ధనార్జన కోసం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయంలోనే కూలిపోయిందన్నారు.