SRD: సిర్గాపూర్ మండలంలోని గ్రామాల్లో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై పంచాయతీ కార్యదర్శులు సర్వే చేపడుతున్నారని ఎంపీడీవో మల్సూర్ నాయక్ తెలిపారు. బుధవారం స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమంలో గతేడాది దరఖాస్తు పెట్టుకున్న లబ్ధిదారుల వివరాలను సేకరించి, మొబైల్ యాప్లో సెక్రటరీలు నమోదు చేస్తారని తెలిపారు.