BDK: జిల్లాలో కలెక్టర్ జితేష్ పటేల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలు పాటించలేని కొంతమంది మండల స్థాయి అధికారులు గుత్తేదారులు ఇచ్చే ముడుపులకు ఆశపడి అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు గోదావరి అనే తేడా లేకుండానే అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.