KMR: అనారోగ్యంతో బాధపడుతూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేట్ మండలంలో జరిగింది. ఎస్సై సుధాకర్ వివరాల ప్రకారం.. మోతే గ్రామానికి చెందిన కిష్టయ్య(46) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.