ADB: మావల మండలంలోని బట్టి సావర్గం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం పర్యటించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అర్హులైన ప్రజలకు లబ్ధి చేకూరాలని కలెక్టర్ సూచించారు.