HYD: టీవల కురుస్తున్న భారీ వర్షాలకు బల్కంపేట నుంచి బేగంపేట్ వెళ్లే అండర్ పాస్ బ్రిడ్జి కింద వరదల్లో చిక్కుకొని తాజాగా ఓ యువకుడు మరణించిన విషయం తెలిసిందే. కాగా, పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ కోట నీలిమ స్పందించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా అధికారులు రాత్రింబవళ్ళు పని చేస్తున్నారని పేర్కొన్నారు.