MNCL: నెన్నెల మండలం నందులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి పాకాల భీమేష్(47) అనే వ్యక్తి మృతి చెందాడు. భీమేష్కి మతిస్థిమితం సరిగా ఉండదని, 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లాడని, శుక్రవారం బహిర్భూమికి వెళ్లిన ఒక గ్రామస్థుడు మృతదేహాన్ని గమనించి సమాచారం అందించాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.