KMM: కార్మికుల హక్కులను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం 139 మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సీపీఐ జెండాను ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల సాధనకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.