KMM: ఖమ్మం పట్టణంలో గురువారం సీపీఐ వందేళ్ల వార్షికోత్సవాలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అణగారిన వర్గాల కోసం నిర్విరామంగా పోరాడేది సీపీఐ మాత్రమే అని ఎమ్మెల్యే తెలిపారు. నిజాం పాలించిన సమయంలోనే మూడు గ్రామాలకు స్వాతంత్య్రం రావడానికి ఎర్రదండు కృషి చేసిందన్నారు.