KMR: కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. నేడు పిట్లంలోని CHCలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అద్దాలు వాడాలని సూచించినట్లు పేర్కొన్నారు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మొబైల్, స్క్రీన్ వినియోగం తగ్గించాలన్నారు.